Advertisement

  • మ్యాచ్‌ ముగిసే వరకు ఆ రికార్డు నాకే తెలియలేదు

మ్యాచ్‌ ముగిసే వరకు ఆ రికార్డు నాకే తెలియలేదు

By: chandrasekar Fri, 16 Oct 2020 11:05 AM

మ్యాచ్‌ ముగిసే వరకు ఆ రికార్డు నాకే తెలియలేదు


దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ పేసర్‌ ఎన్రిచ్‌ నోర్జే ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని వేశానని మ్యాచ్‌ ముగిసే వరకు తనకే తెలియదని అన్నాడు. ఆ తర్వాత తాను ఈ విషయం గురించి విన్నానని ఆ జట్టు ఓపెనర్‌ ధవన్‌తో గురువారం ఓ వీడియోలో అతడు పేర్కొన్నాడు.

బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి లీగ్‌లో ఫాస్టెస్‌ బాల్‌ రికార్డును నోర్జే నమోదు చేశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పేసర్‌, బెంగళూరు స్టార్‌ డేల్‌ స్టెయిన్ ‌(154.4 కిలోమీటర్లు) వేసిన బంతే రికార్డుగా ఉండేది.

కాగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లోనే గంటకు 155కిలోమీటర్ల వేగంతో వేసిన బంతితో బట్లర్‌ను ఔట్‌ చేసిన నోర్జే.. ఫాస్టెస్ట్‌ బాల్‌ జాబితాలో రెండో స్థానంలోనూ నిలిచాడు. వేగం, స్వింగ్‌తో కీలకమైన వికెట్లు తీస్తూ ఈ సీజన్‌లో నోర్జే ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Tags :
|

Advertisement