ఏ క్షణంలో ఐపీయల్ ఆడమన్న నేను సిద్ధం ..సురేష్ రైనా
By: Sankar Tue, 21 July 2020 7:37 PM
ఐపీఎల్ ఎక్కడ జరిగినా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా పేర్కొన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడటంతో .. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్కు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఫ్రాంచైజీలు తమ పనిలో నిమగ్నమై ఉన్నాయని.. ఆటగాళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు.
`యువ ఆటగాడు రిషబ్ పంత్ను సంప్రదిస్తే అతడు కూడా ప్రాక్టీస్కు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దీంతో మేమిద్దరం కలిసి ఘాజియాబాద్లోని నా సొంత మైదానంలో శిక్షణ మొదలు పెట్టాం. పది రోజులుగా నెట్స్లో శ్రమిస్తున్నాం. మమ్మల్ని ఏ క్షణంలో ఆడమన్నా అడేందుకు సిద్ధంగా ఉన్నాం` అని రైనా మంగళవారం పేర్కొన్నాడు.
ఇక మిస్టర్ ఐపీయల్ గా ప్రసిద్ధి పొందిన రైనా గత కొంతకాలంగా జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు ..ఈ ఏడాది ఐపీయల్ రాణించి ఆస్ట్రేలియా లో జరిగే టి ట్వంటీ వరల్డ్ కప్ లో స్థానం సంపాదించాలని అనుకున్నాడు ..అయితే కరోనా రావడంతో అతడి అంచనాలు తలకిందులు అయ్యాయి..