బెంగళూరు పై విజయంతో సెకండ్ క్వాలిఫైయర్ ఆడనున్న హైదరాబాద్
By: chandrasekar Sat, 07 Nov 2020 2:12 PM
సన్ రైజర్స్ హైదరాబాద్
అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్
నిష్క్రమించింది. అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్
మ్యాచ్లో 132 పరుగుల లక్ష్యాన్ని కేన్ విలియమ్సన్ (50
నాటౌట్: 44
బంతుల్లో 2x4, 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో మరో 2
బంతులు మిగిలి ఉండగానే సన్రైజర్స్ హైదరాబాద్ 132/4తో ఛేదించేసింది.
రానున్న ఆదివారం ఢిల్లీ
క్యాపిటల్స్తో అబుదాబి వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఢిల్లీ తో హైదరాబాద్ తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే
మంగళవారం దుబాయ్లో ముంబయి ఇండియన్స్తో తుది పోరులో ఢీకొట్టనుంది. మ్యాచ్లో
అంతకముందు ఫాస్ట్ బౌలర్లు జేసన్ హోల్డర్ (3/25),
నటరాజన్ (2/33)
దెబ్బకి టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితమైంది.
టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది.
బెంగళూరు జట్టులో ఏబీ
డివిలియర్స్ (56: 43 బంతుల్లో 5x4)
టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓపెనర్గా వచ్చిన కెప్టెన్
విరాట్ కోహ్లీ (6: 7 బంతుల్లో), మంచి ఫామ్లో ఉన్న మరో ఓపెనర్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్
(1: 6
బంతుల్లో), అరోన్ ఫించ్ (32:
30 బంతుల్లో 3x4,
1x6), మొయిన్ అలీ (0),
శివమ్ దూబే (8),
వాషింగ్టన్ సుందర్ (5) తేలిపోయారు. అయినప్పటికీ
ఒక ఎండ్లో ఓపికగా ఆడిన డివిలియర్స్ బెంగళూరుకి ఆ మాత్రం స్కోరైనా అందించాడు.
లేకుంటే ఇంకా తక్కువ స్కోరుకే ముగించుండేది.