27వ అంతస్థు నుంచి పడి కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
By: Sankar Tue, 10 Nov 2020 1:39 PM
వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు కెనడాలోని టొరంటోలో బహుళ అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఫేజ్-4లో నివాసం ఉంటున్న శ్రీకాంత్ చిన్న కుమారుడు పాణ్యం అఖిల్(19) కెనడాలోని టొరంటోలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి చేసుకుని గత మార్చి 20న నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి అక్టోబర్ 5న కెనడాకు వెళ్లాడు.
ఈ నెల 8న తెల్లవారుజామున తాను ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనీలో ఫోన్లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. అతని స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు
Tags :
student |
deceased |
canada |