ఓఎల్ఎక్స్ నేరగాళ్లను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
By: chandrasekar Sat, 17 Oct 2020 6:00 PM
హైదరాబాద్ పోలీసులు
సెకండ్ హ్యాండ్ వస్తువులను సులువుగా అమ్మే వేదిక అయిన ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా
మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. ఇందుకోసం వారు
రాజస్థాన్కు వెళ్లి స్థానిక భరత్పూర్ జిల్లాలోని కళ్యాణ్పురి, చౌ
వేరా గ్రామాల్లో ఉన్న నిందితుల ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేశారు. వెంటనే వారిని
అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్కు చెందిన ముఠా ఓఎల్ఎక్స్లో వాహనాల ఫొటోలు
పెట్టి, తక్కువ
ధరకే అమ్ముతామంటూ మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఎంతోమంది బాధితులు వీరి మోసాలకు
బలయ్యారు. ఈ క్రమంలో నేరగాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన సైబర్ క్రైం
పోలీసులు, వారిని
వెతుక్కుంటూ రాజస్థాన్కు వెళ్లారు. పది మంది సభ్యులు గల ఈ బృందానికి భరత్పూర్
జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేసే వంద మంది స్థానిక పోలీసులు కూడా సహకరించారు.
అందరూ కలిసి, కళ్యాణ్పురి, చౌ
వేరా గ్రామాల్లో తలదాచుకున్న నిందితుల ఇళ్లపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న
నేరగాళ్ల ముఠా, వారి కుటుంబ సభ్యులు పోలీసులపై ఎదురుదాడికి దిగి, వాహనాలను
ధ్వంసం చేశారు. పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో చేసేది లేక అక్కడి
నుంచి పారిపోయారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బృందాలు మోహన్ సింగ్
ఇర్ఫాన్, రాహుల్, అజరుద్దీన్, వాజిత్
ఖాన్, సాహిల్, సత్యవీర్
సింగ్, ఇర్ఫాన్, తారీఫ్
ఖాన్, ఉమ్రాన్
ఖాన్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 5 రోజుల క్రితం 8
మందిని అరెస్టు చేయగా, ప్రస్తుతం మరో 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.