Advertisement

  • ఒక్క మహిళ కోసం స్పెషల్ మెట్రో ట్రైన్ నడిపిన హైదరాబాద్ మెట్రో..

ఒక్క మహిళ కోసం స్పెషల్ మెట్రో ట్రైన్ నడిపిన హైదరాబాద్ మెట్రో..

By: Sankar Sun, 18 Oct 2020 07:19 AM

ఒక్క మహిళ కోసం స్పెషల్ మెట్రో ట్రైన్ నడిపిన హైదరాబాద్ మెట్రో..


హైదరాబాద్‌లో మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. రోడ్లపైకి నీరు చేరడంతో నగరంలో కొన్ని చోట్ల రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఆ వరద నుంచి హైదరాబాద్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి ఎదురైన వారు నానా యాతన పడ్డారు. ఇలాంటి పరిస్థితే నగరంలో బుధవారం నాడు ఓ నిండు గర్భిణీకి ఎదురైంది. ఆమె ఆ చివర నుంచి ఈ చివర వరకు వెళ్లాల్సి వచ్చింది. రోడ్లన్నీ పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోగా ఆమె వెళ్లే మార్గమే లేకపోయింది. ఈ క్రమంలో మెట్రో రైలు ఒక్కటే మార్గంగా నిలిచింది.చేసేది లేక ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమెను మెట్రో స్టేషన్‌కు తీసుకొచ్చారు.

మెట్రో ఎమెర్జెన్సీలో ఆదుకోవడానికి అధికారులు ముందుకు వచ్చారు. ఆ గర్భవతిని గమ్యస్థానానికి చేర్చి తమ కర్తవ్య దీక్షను చాటుకున్నారు. ఈ నెల 14న రాత్రి 10 గంటలకు ఒక గర్భవతి కొత్తపేట్‌లోని విక్టోరియా మెమోరియల్ స్టేషన్ చేరుకున్నారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ వేరే మార్గం లేదని వచ్చిన ఆమె కోసం ప్రత్యేకంగా స్పెషల్ సర్వీస్‌ నడిపి గమ్యస్థానానికి చేర్చారు.


Tags :
|

Advertisement