Advertisement

  • గ్రేటర్ వాసులకు ఊరట ..సెప్టెంబర్ ఏడు నుంచి పట్టాలెక్కనున్న మెట్రో

గ్రేటర్ వాసులకు ఊరట ..సెప్టెంబర్ ఏడు నుంచి పట్టాలెక్కనున్న మెట్రో

By: Sankar Wed, 02 Sept 2020 08:45 AM

గ్రేటర్ వాసులకు ఊరట ..సెప్టెంబర్ ఏడు నుంచి పట్టాలెక్కనున్న మెట్రో


దేశంలో ప్రస్తుతం అన్ లాక్ 4 కొనసాగుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ అమలు చేస్తూనే మెట్రో రైళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి.

దీనితో హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైళ్లు కూడా సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే, మెట్రో కొన్ని షరతులు విధించింది. గతంలో మెట్రో ట్రైన్ ఫ్లాట్ ఫామ్ వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు నిలబడేవారు. కానీ, ఈసారి నుంచి ఆ పరిస్థితి ఉండదు. ఫ్లాట్ ఫామ్ మీదకు కొద్ది మందిని మాత్రమే అనుమతి ఇస్తారు. గతంలో ఒక్కో ట్రైన్లో వెయ్యి మంది వరకు ప్రయాణం సాగించేవారు. కానీ, ఈ సంఖ్యను కూడా పరిమితం చేయనున్నారు.

సెప్టెంబర్ 7 న కొన్ని రైళ్లను మాత్రమే నడపబోతున్నారు. వివిధ కారిడార్లో దశలవారీగా మెట్రోను అనుమతించే అవకాశం ఉన్నది. రైల్లోకి గాలి వెలుతురూ వచ్చేలా ఏర్పాటు చేయబోతున్నారు. మెట్రోలో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేఫ్ గా జర్నీ చేసేలా చూసేందుకు మెట్రో సంస్థ ప్లాన్ చేస్తున్నది.

Tags :

Advertisement