నాకు పీసీసీ అధ్యక్షుడిగా ప్రమోషన్ కావాలి ...అంజన్ కుమార్ యాదవ్
By: Sankar Thu, 10 Dec 2020 6:22 PM
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవికి ఏ క్షణాన అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసాడో క అప్పటినుండి పిసిసి చీఫ్ పదవి కోసం ప్రయత్నించే నేతల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ..అందరు కోమటి రెడ్డి , రేవంత్ రెడ్డి లలో ఎవరో ఒకరికి వస్తుంది అనిభావించారు కానీ ఇప్పుడు రేస్ లో చాల మంది నేతలు ఉన్నారు...
తాజాగా ఆ రేసులో అంజన్ కుమార్ యాదవ్ కూడా చేరారు. రెండుసార్లు ఎంపీగా పని చేసిన తాను పీసీసీ అధ్యక్ష పదవికి అర్హుడేనని తెలిపారు. తనకు పీసీసీ అధ్యక్షుడుగా ప్రమోషన్ కావాలని, అందుకే హైదరాబాద్ అధ్యక్షుడుగా రాజీనామా చేశానని తెలిపారు. హైదరాబాద్ సిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయాన్ని అంజనీ కుమార్ గురువారం అధికారికంగా ప్రకటించారు.
ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందుకు రాష్ట్ర పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్లో మకాం వేశారు