హైదరాబాద్ సిటీ బస్సులు నేటి నుంచి తిరిగి ప్రారంభం
By: chandrasekar Fri, 25 Sept 2020 12:06 PM
ఆరు నెలలుగా కరోనా
కారణంగా నిలిచిపోయిన హైదరాబాద్ సిటీ బస్సులు నేటి నుంచి తిరిగి ప్రారంభం
కానున్నాయి. శుక్రవారం నుంచి 25 శాతం బస్సులు నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ
అజయ్కుమార్ పేర్కొన్నారు.
బుధవారం నగర శివారు
ప్రాంతాలైన రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, హకీంపేట, ఫలక్నుమా, మిథాని, మియాపూర్, హయత్నగర్ డిపోల నుంచి పాక్షికంగా బస్సులు
ప్రారంభమయ్యాయి.
ఈ డిపోల నుంచి 12
చొప్పున సర్వీసులను నడిపినట్లు సమాచారం. సిటీ సబర్బన్ ప్రాంతాలకు 15
కిలోమీటర్ల పరిధిలో బస్సులు నడిపారు. శివారు గ్రామాల్లోని ప్రయాణికుల అభ్యర్థన
మేరకు బస్సులను ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలో బస్సులో
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండేది. ఇకపై ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు
తీసుకోనున్నట్లు అధికారులు తెలియజేశారు.