- హోమ్›
- వార్తలు›
- ఔట్లుక్ ర్యాంకింగ్స్లో 75 యూనివర్సిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 5వ స్థానం
ఔట్లుక్ ర్యాంకింగ్స్లో 75 యూనివర్సిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 5వ స్థానం
By: chandrasekar Mon, 14 Sept 2020 4:46 PM
ఔట్లుక్ ర్యాంకింగ్స్లో
హెచ్సీయూకి 5వ స్థానం లభించింది. ఔట్లుక్ పత్రిక దేశంలోని
ఉత్తమమైనవిగా ఎంపిక చేసిన 75 యూనివర్సిటీల్లో హెచ్సీయూకి 5వ
స్థానం, ఉస్మానియా
యూనివర్సిటీకి 23వ స్థానం దక్కాయి. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్
ఆఫ్ సైన్స్ నంబర్ వన్గా నిలిచింది.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి రెండో స్థానం దక్కింది.
వడ్డేశ్వరంలోని కోనేరు
లక్ష్మయ్య యూనివర్సిటీ(కెఎల్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్)కు 32వ
స్థానం, తిరుపతి
శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీకి 54వ స్థానంలో ఉన్నాయి. అకడమిక్, పరిశోధనా
రంగాల్లో ప్రతిభ, పరిశ్రమలతో సంబంధాలు, ప్లేస్మెంట్ అవకాశాలు, మౌలిక
సదుపాయాలు, సౌకర్యాలు, పరిపాలన, అడ్మిషన్లు, వైవిధ్యం, అందుబాటు ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు.
ఉత్తమ స్థాయిలో ఉన్న 25
సెంట్రల్ యూనివర్సిటీల ర్యాంకింగ్లలో
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఉత్తమ స్థాయిలో ఉన్న 23
సాంకేతిక విద్యాలయాల ర్యాంకుల్లో హైదరాబాద్
ట్రిపుల్ ఐటీకి 11వ, హైదరాబాద్ ఐఐటీకి 14వ, అనంతపురం
జేఎన్టీయూకు 18వ, గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఆఫ్ సైన్స్కు 23వ
స్థానం దక్కాయి. ఉత్తమ స్థాయిలో ఉన్న 75 పబ్లిక్ స్టేట్ వర్సిటీల్లో విశాఖలోని ఆంధ్రా
యూనివర్సిటీకి 5వ స్థానం, హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి 10వ స్థానం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీకి 22వ
స్థానం, శ్రీవేంకటేశ్వరా
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు 42వ స్థానం, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి 56వ
స్థానం, హైదరాబాద్లోని
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి 64వ
స్థానం,
గుంటూరులోని ఆచార్య ఎన్జీ
రంగా యూనివర్సిటీకి 65వ స్థానం, కడపలోని యోగి వేమన వర్సిటీకి 69వ
స్థానం దక్కాయి. ఉత్తమ 50 డీమ్డ్ యూనివర్సిటీల ర్యాంకింగ్లను పోలిస్తే
కోనేరు లక్ష్మయ్య వర్సిటీకి 12వ, విశాఖలోని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్
మేనేజిమెంట్కు 22వ, హైదరాబాద్లోని ఐసిఎ్ఫఏఐ ఫౌండేషన్కు 36వ
ర్యాంకు, అనంతపురంలోని
శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్కు 43వ
ర్యాంకు లభించాయి. దేశంలోని 25 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ సెంట్రల్
యూనివర్సిటీ రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని ఉపకులపతి అప్పారావు అన్నారు.