Advertisement

  • నల్గొండ జిల్లాలో విషాదం ...భర్త రెండో భార్య పిల్లలను చంపి తాను కూడా చనిపోయిన మొదటి భార్య

నల్గొండ జిల్లాలో విషాదం ...భర్త రెండో భార్య పిల్లలను చంపి తాను కూడా చనిపోయిన మొదటి భార్య

By: Sankar Thu, 10 Dec 2020 9:41 PM

నల్గొండ జిల్లాలో విషాదం ...భర్త రెండో భార్య పిల్లలను చంపి తాను కూడా చనిపోయిన మొదటి భార్య


నల్గొండ జిల్లా కేంద్రంలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భ‌ర్త రెండో భార్య‌కు చెందిన ఇద్ద‌రు పిల్ల‌ల్ని మొద‌టి భార్య చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

న‌ల్ల‌గొండ క‌లెక్ట‌రేట్ స‌మీపంలో గురువారం ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మేక‌ల ప్ర‌దీప్‌, ప్ర‌స‌న్న‌రాణి ఇరువురు దంప‌తులు. ప్ర‌స‌న్న‌రాణిని కొన్నాళ్ల‌క్రితం ప్ర‌దీప్ వ‌దిలేశాడు. శాంతి అనే మ‌హిళ‌ను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరిరువురికి మేఘ‌న‌, రుచ‌రి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు.

ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో భ‌ర్త‌ రెండో భార్య కుటుంబంపై క‌క్ష్య పెంచుకున్న మొద‌టి భార్య.. రెండో భార్య సంతానం ఇద్ద‌రు అమ్మాయిల మెడ‌ల‌కు తాళ్లు బిగించి హ‌త్య చేసింది. అనంత‌రం తాను సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్ర‌దీప్ రామ‌న్న‌పేట‌లో, ప్ర‌స‌న్న‌రాణి మునుగోడులో, శాంతి జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఐసీడీఎస్ ఆప‌రేట‌ర్లుగా ప‌నిచేస్తున్నారు.

Tags :
|

Advertisement