భార్యను నరికి చంపిన భర్త
By: Sankar Sun, 09 Aug 2020 12:04 PM
నేటి సమాజంలో జనాలు వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు ..ఇలా సొంత కొడుకు బార్యతోనే రాసలీలలు నడిపించిన తండ్రి చివరకు కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురి అయ్యాడు ..దీనితో జైలు పాలుఅయిన కొడుకు ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చాడు ..అయితే బయటకు వచ్చాక తన తండ్రితోనే బరితెగించిన భార్యపై పగ పెంచుకున్నాడు. జైలు నుంచి బయటికొచ్చాక భార్యని కిరాతకంగా నరికేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని పెన్పహాడ్ మండలం జల్మలకుంట తండాకి చెందిన లునావత్ స్వామి భార్య సరోజ(35) సొంతమామతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో మామతో రాసలీలలు సాగించింది. ఆ విషయం కొడుక్కి తెలిసిపోవడంతో కోపంతో రగిలిపోయాడు. కూతురిలా చూసుకోవాల్సిన కోడలితో శారీరక సంబంధం పెట్టుకోవడంతో కన్నతండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఆ కేసులో జైలుకెళ్లాడు.
అయితే మామతో బరితెగించిన భార్యపై స్వామి పగ పెంచుకున్నాడు. జైలు నుంచి బెయిల్పై బయటికొచ్చి భార్యని దారుణంగా నరికి చంపేశాడు. గొడ్డలితో విచక్షణా రహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్వామి వారం రోజుల కిందటే బెయిల్పై బయటికొచ్చినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.