భర్తకి కరోనా సోకడంతో భార్య మరొకరితో వివాహేతర సంబంధం
By: chandrasekar Fri, 28 Aug 2020 8:58 PM
భర్తకి కరోనా సోకడంతో భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం కాకినాడలో చోటుచేసుకుంది. కట్టుకున్నోడు కరోనా సోకి ఇంట్లో ఐసోలేషన్లో ఉంటే భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకి కరోనా సోకిందన్న బాధ ఉందో లేదో కానీ మరొకరితో రాసలీలలకు రెడీ అయిపోయిందో భార్య. రోజూ ఇంటికి వచ్చి పండ్లు ఇచ్చి వెళ్తున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తీరా ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో ప్రియుడితో కలసి కట్టకున్నోడిపైనే దాడి చేసి తీవ్రంగా కొట్టింది.
ఇటువంటి ఘోర సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కాకినాడ పాతబస్టాండ్ సెంటర్ న్యూ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన ఐసోలేషన్లో ఉండడంతో అన్నమ్మఘాటీ ఏరియా రెల్లి కాలనీకి చెందిన మరో వ్యక్తి రోజూ పండ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడు. నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండడంతో వైరస్ బాధితుడి భార్య తరచు వచ్చి వెళ్లే వ్యక్తితో పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
వీరు ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు. తీరా ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో కథ అడ్డం తిరిగింది. తన ఇంటికి వచ్చిన వ్యక్తి తో ఆమె భర్త గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో అతని భార్య ప్రియుడికే వంతపాడింది. అంతటితో ఆగని ఆమె ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తపైనే చేయిచేసుకుంది. స్పందించిన స్థానికులు వెంటనే భర్తని జీజీహెచ్కి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కరోనా కారణంగా చోటుచేసుకున్న ఈ సంఘటన గురించి బాదితుడిపై స్థానికులు సానుభూతి వ్యక్తంచేస్తున్నారు.