Advertisement

పాకిస్థాన్‌లో భారీ ప్రేలుడు.. 4 మృతి

By: Anji Wed, 30 Sept 2020 09:31 AM

పాకిస్థాన్‌లో భారీ ప్రేలుడు.. 4 మృతి

పాకిస్థాన్‌లోని మర్థాన్‌ నగరంలో భారీ ప్రేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ వలన ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

మృతి చెందిన నలుగురులో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement