గ్లోబల్ పీస్ యూనివర్సిటీ కాదంబరి కిరణ్కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది
By: chandrasekar Thu, 09 July 2020 10:52 AM
కాదంబరి కిరణ్ తెలుగులో
పలు చిత్రాల్లో హాస్య నటుడిగా, కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్ననటుడు.
కాదంబరి కిరణ్కు ప్రముఖ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ‘మనం సైతం
అంటూ సినీ, సామాజిక రంగాల్లో చేస్తోన్న సేవలకు గాను
ప్రతిష్టాత్మిక గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఈయనకు’ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక సేవలు, సినీరంగానికి సంబంధించిన వారికి కూడా ఈయన ఎన్నోసేవలను
అందించారు.
జర్నలిస్టుగా జీవితాన్ని
ప్రారంభించిన ఈయన ఆ తర్వాత నటుడిగా మారాడు. యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న
కాదంబరి కిరణ్ ‘మనం సైతం’ పేరుతో స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థతో ఆయన
పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాదంబరి కిరణ్కు డాక్టరేట్
రావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.తనకు అభినందించిన
వారందరికీ కాదంబరి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.