హానర్ మొట్టమొదటి ల్యాప్టాప్ భారత్లో లాంచ్...రూ.3000 డిస్కౌంట్
By: chandrasekar Sat, 01 Aug 2020 10:37 AM
హానర్ మ్యాజిక్బుక్ 15 (8జీబీ
ర్యామ్ +256జీబీ SSD) పేరుతో
శుక్రవారం 15.6 అంగుళాల ఫుల్వ్యూ డిస్ప్లే
కలిగిన ల్యాప్టాప్ను ఆవిష్కరించింది.
చైనా కంపెనీ హువావే సబ్
బ్రాండ్ హానర్ మొట్టమొదటి
ల్యాప్టాప్ను భారత్లో లాంచ్ చేసింది.
పాప్ అప్ వెబ్క్యామ్, 2 ఇన్ 1
ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్,
65 W ఫాస్ట్ ఛార్జర్, ఏఎండీ
రైజెన్ 3000 సిరీస్ సీపీయూ, వెగా
గ్రాఫిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
విండీస్ ప్రీ-ఇన్స్టాల్తో వస్తున్నది. మిస్టిక్ సిల్వర్ కలర్
వేరియంట్లో ఉన్న మ్యాజిక్బుక్ విక్రయాలు ఆగస్టు 6 నుండి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి.
ఫస్ట్సేల్లో భాగంగా
ల్యాప్టాప్పై డిస్కౌంట్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. భారత్లో మ్యాజిక్బుక్ 15 ధర
రూ.42,990గా ఉంది. ఫస్ట్సేల్ ఆఫర్లో భాగంగా
కంపెనీ రూ.3000 డిస్కౌంట్
ఇస్తుండటంతో రూ. 39,990కే ల్యాప్టాప్ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు