Advertisement

  • మళ్లీ ఎయిర్‌ ఇండియా‌ విమాన సర్వీసులను హాంగ్‌ కాంగ్ రద్దు చేసింది... ‌

మళ్లీ ఎయిర్‌ ఇండియా‌ విమాన సర్వీసులను హాంగ్‌ కాంగ్ రద్దు చేసింది... ‌

By: chandrasekar Thu, 29 Oct 2020 4:44 PM

మళ్లీ ఎయిర్‌ ఇండియా‌ విమాన సర్వీసులను హాంగ్‌ కాంగ్ రద్దు చేసింది... ‌


హాంగ్‌ కాంగ్‌ ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులను మళ్లీ రద్దు చేసింది. ముంబై టు హాంగ్‌ కాంగ్‌ విమానాలను రెండు వారాలపాటు రద్దు చేసింది. ఇటీవల భారత్ నుంచి ఆ దేశానికి ప్రయాణించిన కొందరికి అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మరోసారి నవంబర్‌ 10 వరకు ఎయిర్‌ ఇండియా విమానాలను రద్దు చేసింది.

హాంగ్‌ కాంగ్‌ నాలుగోసారి భారత్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేసి౦ది. ఢిల్లీ-హాంగ్‌ కాంగ్‌ విమాన సర్వీసులను ఆగస్టు 18 నుంచి 31 వరకు, సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 3 వరకు, అక్టోబర్‌ 17 నుంచి 30 వరకు ఆ దేశం రద్దు చేసింది. మరోవైపు పలు ఆంక్షలు కూడా విధించింది. ప్రయాణానికి 72 గంటల ముందుగా పరీక్షలో నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి.

ప్రయాణికులు హాంగ్‌ కాంగ్‌ చేరిన తర్వాత కూడా మరోసారి కరోనా పరీక్ష చేయించుకోవాలి. భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌, ఇథియోపియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, నేపాల్, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్, రష్యా, దక్షిణ ఆఫ్రికా, బ్రిటన్‌, అమెరికా దేశాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని హాంగ్‌ కాంగ్‌ తెలిపింది.

Tags :

Advertisement