42 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టన హోల్డర్
By: chandrasekar Fri, 10 July 2020 2:48 PM
సౌథాంప్టన్ వేదికగా
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ కెప్టెన్ జేసన్
హోల్డర్ నిప్పులు చెరిగాడు. 20 ఓవర్లు బౌలింగ్ చేసిన హోల్డర్ 42
పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్
చేసిన ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్లో 204 పరుగులకే కుప్పకూలిపోయింది.
ఆ జట్టులో కెప్టెన్ బెన్స్టోక్స్
(43: 97 బంతుల్లో 7x4) టాప్ స్కోరర్గా నిలిచాడు. బుధవారం ఆరంభమైన ఈ టెస్టు
మ్యాచ్కి వర్షం పదే పదే ఆటంకం కలిగించడంతో నిన్న కేవలం 17.4 ఓవర్ల
ఆట మాత్రమే సాధ్యమైంది. దాంతో ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్ నైట్ స్కోరు 35/1తో
తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ టీమ్ వరుసగా వికెట్లు చేజార్చుకుని 67.3
ఓవర్లలోనే ఆలౌటైంది.
హోల్డర్ (6/42)కి
తోడుగా మరో ఫాస్ట్ బౌలర్ గాబ్రిల్ (4/62)
కూడా చెలరేగడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ ఏ దశలోనూ భారీ
స్కోరు చేసేలా కనిపించలేదు. మధ్యలో బెన్స్టోక్స్ పోరాడినా అతనికి సహకరించేవారు
టీమ్లో కరవయ్యారు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ (35: 47 బంతుల్లో 6x4) వన్డే
తరహా ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. కరోనా వైరస్
కారణంగా 117
రోజులు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఈ టెస్టుతో మొదలైంది. పూర్తిగా
బయో-సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు
నిర్వహిస్తుండగా సక్సెస్ అయితే మిగిలిన
దేశాలు కూడా సిరీస్లు ప్రారంభించే అవకాశం ఉంది.