Advertisement

  • క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ...గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ...గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ

By: Sankar Mon, 07 Dec 2020 5:33 PM

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ...గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ


ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఎంపికకు కీలక ఆటగాడైన రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బీసీసీఐ మళ్లీ వెనక్కి తగ్గి టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మను ఎంపిక చేసింది అనే విషయం తెలిసిందే.

ఆ తర్వాత రోహిత్ శర్మ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంటూ తెలిపింది అయితే.. రోహిత్ శర్మ ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు అన్న కారణంతో అతనిని ఆస్ట్రేలియా పర్యటనకు నుంచి తప్పించారు.

ఇక ఇప్పుడు రోహిత్ శర్మ పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయం బారిన పడిన రోహిత్ శర్మ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. డిసెంబర్‌ 11న బెంగళూరులోని ఎన్‌సీఏలో అతడికి ఫిట్‌నెస్‌ పరీక్షలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రోహిత్‌ మరుసటి రోజే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశముంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారులు తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌ 12న ఆసీస్‌కు రోహిత్ పయనమవుతాడని చెప్పారు.

Tags :
|
|

Advertisement