Advertisement

  • తన తండ్రి ఆరోగ్యం విషయమై ఏ విషయమైన మా ద్వారా మీడియాకు తెలియజేస్తామన్న తనయుడు SPB చరణ్

తన తండ్రి ఆరోగ్యం విషయమై ఏ విషయమైన మా ద్వారా మీడియాకు తెలియజేస్తామన్న తనయుడు SPB చరణ్

By: chandrasekar Fri, 11 Sept 2020 6:57 PM

తన తండ్రి ఆరోగ్యం విషయమై ఏ విషయమైన  మా ద్వారా మీడియాకు తెలియజేస్తామన్న తనయుడు SPB చరణ్


కరోనా కారణంగా హాస్పిటల్లో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషయమై ఏ విషయమైన మా ద్వారా మీడియాకు తెలియజేస్తామని తనయుడు SPB చరణ్ వెల్లడించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నాయి. ఆయన మెల్లమెల్గగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం వైద్యులు తెలిపారు.

ఆయనకు అవసరమైతే లంగ్స్ మార్పిడి చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఈయన ఆరోగ్యం గురించి తరుచూ ఎప్పటికప్పుడు ఆయన తనయుడు చరణ్ కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ ప్రస్తుతం బాలు కరోనా నుంచి కోలుకున్నా ఇప్పటికీ ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.

కరోనా నుండి కోలుకోవడంతో ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవని చెప్పారు. తాజాగా చరణ్ తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వివిధ మాధ్యమాలు వారికి తోచినట్టు రాస్తున్నారు. ఇక తన తండ్రి హెల్త్ విషయమై ఏ విషయమైన మా ద్వారా మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.

Tags :
|
|

Advertisement