ఆదివారంతో అతడి ఏడేళ్ల శిక్ష ముగిసింది
By: chandrasekar Mon, 14 Sept 2020 12:20 PM
ఐపీఎల్-13లో
స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడినట్లు
ఆరోపణలు ఎదుర్కొన్న కేరళ ఆటగాడు శ్రీశాంత్పై
తొలుత బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.
గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు
పేసర్పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. అలాగే తనపై విధించిన శిక్షను కూడా
తగ్గించాలని బీసీసీఐ అంబుడ్స్మన్ను ఆదేశించింది. అతడి శిక్షను ఏడేళ్లకు
తగ్గిస్తూ అప్పటి బీసీసీఐ అంబుడ్స్మన్
డీకే జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన 2013 నుంచి
అమల్లోకి వచ్చింది. టీమిండియా పేసర్ ఎస్. శ్రీశాంత్పై విధించిన నిషేధం
ఆదివారంతో ముగిసింది. తనపై నిషేధంపై
శ్రీశాంత్ చాలా ఏండ్ల పాటు న్యాయ పోరాటం
చేశాడు.
'ఇప్పుడు నాపై
ఎలాంటి అభియోగాలు లేవు. పూర్తి స్వేచ్ఛ లభించింది. నేను అమితంగా ప్రేమించే క్రికెట్ ఆడతాను. నా
బౌలింగ్లో ప్రతీ బంతిని అత్యుత్తమంగా
విసురుతాను. గరిష్టంగా మరో ఐదు లేదా ఏడేండ్ల పాటు
ఆటలో కొనసాగుతాను. నేను ఏ జట్టుకు
ఆడినా అద్భుత ప్రదర్శన చేస్తానని' శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27
టెస్టులు, 53
వన్డేలు, 10 టీ20
మ్యాచ్లు ఆడటంతో పాటు ఐపీఎల్లోనూ 44 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు.