అనారోగ్యంతో బాధపడుతున్న హిందీ దర్శకుడు నిషికాంత్ కామత్
By: chandrasekar Wed, 12 Aug 2020 7:52 PM
అనారోగ్యంతో బాధపడుతున్న హిందీ
సినిమా దర్శకుడు నిషికాంత్ కామత్ హాస్పిటల్లో చేరారు. ప్రముఖ హిందీ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్య
పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్
హస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కామత్ గత కొంత కాలం నుండి లివర్ సిరోసిస్తో
అనే వ్యాదితో బాధపడుతున్నాడు. అయితే కొంతకాలం బాగానే ఉన్న ఇటీవల ఆ వ్యాదీ
తిరగబెట్టినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆయన్ను వెంటనే
హస్పిటల్లో చేర్చారు.
ఈయన గారు అజయ్ దేవ్ గన్
హీరోగా వచ్చిన దృశ్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. అంతేకాదు ఆయన అంతకు ముందు
మాదారీ, ముంబై
మేరీ జాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి హిందీలో మంచి పేరు సంపాదించాడు.
నిషికాంత్ కామత్ కొన్ని మరాఠీ చిత్రాలలో కూడా నటించాడు. ఇక నిషికాంత్ కామత్ 2015 లో
విడుదలైన అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన దృశ్యం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి
వచ్చాడు. ఈ చిత్రంలో టబు ప్రధాన పాత్రలో నటించింది.
నిషికాంత్ కామత్ 2016 లో
విడుదలైన జాన్ అబ్రహం నటించిన రాకీ హ్యాండ్సమ్ సినిమాలో నెగటివ్ రోల్ లో
కనిపించారు. నిషికాంత్ 2005 లో మరాఠీ చిత్రం డొంబివాలి ఫాస్ట్కు దర్శకత్వం
వహించారు. ఈ చిత్రం మరాఠీ సినిమాలో ఆ సంవత్సరం అతిపెద్ద విజయాలలో ఒకటిగా
నిలిచింది. ఈ విజయాలతో ఈయన సినీ ఫీల్డ్లో మంచి గుర్తింపుని పొందారు.