తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు ..సచివాలయ కూల్చివేత పనులకు బ్రేక్ ..
By: Sankar Fri, 10 July 2020 2:12 PM
సచివాలయ భవనాల కూల్చివేత విషయమై హైకోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చింది. సోమవారం వరకు కూల్చివేతను నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగరానికి చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. సచివాలయ కూల్చివేతను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే సచివాలయంలోని సగానికి పైగా భవనాలను కూల్చివేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది .
కాగా కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ చర్యల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలి కలుషితం అవుతుందని కోర్టుకు విన్నవించారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని పేర్కొన్నారు.