Advertisement

ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్ట్ లో విచారణ..

By: Sankar Fri, 18 Sept 2020 7:36 PM

ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్ట్ లో విచారణ..


పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు, ఫీజులపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాల ఫీజులపై విద్యాశాఖ కౌంటర్‌ దాఖలు చేసింది.

ఈ ఏడాది పాఠశాలలేవీ ఫీజు పెంచవద్దని ఏప్రిల్‌ 21న జీవో 46 జారీ చేసినట్లు విద్యాశాఖ కౌంటర్‌లో పేర్కొంది. జీవో ప్రకారం ట్యూషన్ ఫీజు నెలవారీగా తీసుకోవాలని సూచించినట్లు వివరించింది. అయితే ఫీజుల విషయంలో 55 పాఠశాలలపై ఫిర్యాదులు అందాయని, వాటికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది.

అయితే, ఈ నోటీసులకు 47 పాఠశాలలు వివరణ ఇచ్చినట్లు వివరించింది. అధికారుల నుంచి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. జీవో 46ను కఠినంగా అమలు చేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది.

Tags :

Advertisement