ఐసీయూలో హీరో రాజశేఖర్...
By: chandrasekar Thu, 22 Oct 2020 6:12 PM
ఇటీవల నటుడు రాజశేఖర్
కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంత క్రిటికల్గానే
ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై తాజాగా హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ఓ ట్వీట్
కూడా చేసింది. తన తండ్రి త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటూ.. అభిమానులందరిని
ప్రార్థన చేయమని కోరింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.
"కరోనాతో నాన్న పొరాటం కాస్త కష్టంగా మారింది. అయినప్పటికీ ఆయన దైర్యంగా
కరోనాతో పోరాడుతున్నారు. మీ ప్రార్దనలు, ప్రేమ, అభిమానం ఆయన్ని రక్షిస్తాయని బలంగా నమ్ముతున్నాం.
నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ ప్రేమ, అభిమానాలతో ఆయన త్వరగానే కోలుకొని బయటకు
వస్తారు" అంటూ శివాత్మిక తన ట్వీట్లో పేర్కోంది.
ఆ తర్వాత మరో ట్వీట్లో
శివాత్మిక తండ్రి ఆరోగ్యంపై మరింత స్పష్టతనిస్తూ.. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నాడని
తెలిపింది. ‘మీ ప్రేమ ప్రార్థనల పట్ల కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. అయితే..
ఇక్కడ విషయం ఏమంటే.. ఆయన పరిస్థితి విషమంగా లేదు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి
నిలకడగానే ఉంది.. అంతేకాదు కోలుకుంటున్నారు కూడా. ఈ సమయంలో మీ ప్రార్థనలు కావాలి.
మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే నాన్న ఆరోగ్యం బాగానే ఉంది
భయపడకండి. ఆరోగ్య పరిస్థితిపై అసత్యవార్తలను ప్రచారం చేయకండి.. అంటూ తెలిపింది.
కాగా తాజాగా రాజశేఖర్
చికిత్స తీసుకుంటున్నహాస్పటల్ ఆయన ఆరోగ్యంపై ఓ బులిటెన్ను విడుదల చేసింది. ఈ
బులెటిన్ ప్రకారం కరోనాతో అడ్మిట్ అయిన ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని అలాగే
ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది అని అంతే కాకుండా రాజశేఖర్ చికిత్సకు
స్పందిస్తున్నారని తెలిపింది హస్పిటల్ యాజమాన్యం. వైద్యులు ఆయన ఆరోగ్యం విషయంలో తాము అన్ని రకాల
చికిత్సలు అందిస్తున్నామని ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. ఇక రాజశేఖర్ మాత్రమే
కాకుండా ఆయన ఇద్దరు కూతుళ్లకు, ఆయన భార్య జీవితకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.
అయితే వారు కరోనా నుండి కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు.