Advertisement

  • నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసారు ..హీరో కృష్ణుడు

నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసారు ..హీరో కృష్ణుడు

By: Sankar Mon, 31 Aug 2020 6:44 PM

నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసారు ..హీరో కృష్ణుడు


139 మంది అత్యాచారం కేసులో బాధితురాలు తనంతట తానే సెలెబ్రిటీలు అయిన యాంకర్ ప్రదీప్ , కృష్ణుడు లకు ఎలాంటి సంబంధం లేదు అని ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే..దీనిపై హీరో కృష్ణుడు స్పందించారు..అత్యాచార కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నిజాలు తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ ట్రోల్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని బాధితురాలు మీడియా ముఖంగా చెప్పిందని గుర్తు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలే మీడియా ముఖంగా చెప్పిందన్నారు.

సంబంధం లేని విషయాల్లో తమను ఇరికించి పరువు తీస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై ఆరోపణలో రాగానే సోషల్‌ మీడియాలో వపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. తమకు కుటుంబం, పిల్లలు ఉన్నారని, ఇది ట్రోల్‌ చేసే వాళ్లు గుర్తించుకోవాలన్నారు.

నిజాలు తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు బాధితురాలు మీడియా ముందుకు వచ్చి నిజం మాట్లాడిందన్నారు. మహిళలకు ఆపద ఉంటే 100కు డయల్‌ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. బాధితురాలికి తమ తరపున ఎలాంటి సహాయం కావాలన్న తాము సిద్దంగా ఉన్నామని కృష్ణుడు పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement