Advertisement

  • నా భర్త హేమంత్ ను చంపడం వల్ల ఇప్పుడు ఎవరు సుఖపడ్డారు ..హేమంత్ భార్య అవంతిక ఆవేదన

నా భర్త హేమంత్ ను చంపడం వల్ల ఇప్పుడు ఎవరు సుఖపడ్డారు ..హేమంత్ భార్య అవంతిక ఆవేదన

By: Sankar Sat, 26 Sept 2020 08:54 AM

నా భర్త హేమంత్ ను చంపడం వల్ల ఇప్పుడు ఎవరు సుఖపడ్డారు ..హేమంత్ భార్య అవంతిక ఆవేదన


హేమంత్ హత్య కేసులో శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం అవంతిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన బతుకు అన్యాయం చేసిన వారిపై విరుచుకుపడ్డారు.

ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి అరెస్టయిన 15 మందికి సమానంగా పెద్ద శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. తన చిన్న మేనమామ అయిన యుగేంధర్ రెడ్డికి ఎన్‌కౌంటర్ చేయడమే పెద్ద శిక్ష అని ఆమె అభిప్రాయపడ్డారు. అతని భార్యా పిల్లలు ఉన్న తాను పట్టించుకోబోనని, తన గురించి అతను ఆలోచించాడా అని ప్రశ్నించారు.

ఇకపై తన దృష్టిలో తల్లిదండ్రులు సహా తన వాళ్లంతా చచ్చిపోయినట్లేనని ఆమె తేల్చి చెప్పారు. తన జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాకు మంగళసూత్రాలు ఇవ్వాల్సిన తల్లిదండ్రులు హేమంత్‌ను హత్య చేసి వాటిని లాగేసుకున్నారు. నన్ను రోడ్డుపై వదిలేశారు. అల్లుడిని ఎవరైనా చంపుకుంటారా? ఇష్టం లేకపోతే అల్లుడిగా అంగీకరించొద్దు కానీ.. చంపడం ఏంటి? వారందరికీ కఠిన శిక్ష పడాలి. నాకు ఎలాగైనా న్యాయం చేయాలి.

నేను ప్రేమించిన వాడిని చంపితే నా తల్లిదండ్రులకు నాపై ప్రేమా ఉన్నట్లా? దాన్ని ప్రేమ అంటారా? 15 మంది ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ్ని చంపుతారా? వాళ్లకు బుద్ధి ఉందా? ఇప్పుడు ఏమైంది అందరూ కలిసి చర్లపల్లి జైల్లో కూర్చున్నారు. ఇక వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదు.

8 సంవత్సరాలుగా నాకు హేమంత్‌తో పరిచయం ఉంది. పెళ్లయ్యాక నేను నా భర్తతో ఉండాల్సిన సమయం నాలుగు నెలలా? హేమంత్‌ను చంపడం వల్ల ఎవరు సుఖ పడ్డారు?’’ అని అవంతిక ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Advertisement