- హోమ్›
- వార్తలు›
- ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు.. కలెక్టర్ ఇంతియాజ్ తీవ్ర హెచ్చరికలు
ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు.. కలెక్టర్ ఇంతియాజ్ తీవ్ర హెచ్చరికలు
By: chandrasekar Fri, 14 Aug 2020 11:28 AM
రాబోయే రెండు రోజుల్లో
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు.
జిల్లాలోని అన్ని
మండలాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు, రెవెన్యూ
యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం
నుంచి రెవెన్యూ, సంబంధిత అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్
టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు
ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలోని అన్ని
రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగంతో సహకరించి వారు జారీ చేసిన
సూచనలు పాటించాలని కోరారు.