తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం...బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
By: chandrasekar Tue, 18 Aug 2020 00:01 AM
తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగేలా కనిపిస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్’గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది.
దీనికి అనుబంధంగా 5.8 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రేపు కూడా వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
అధికారులు అంచనా మేరకు రేపు ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి 24
గంటల్లో ఆ అల్పపీడనం బలపడి పశ్చిమ దిశగా పయనించే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. గోదావరి వరదలకు ఆంధ్ర ప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రజలు కష్టాలు పడుతున్నారు.