Advertisement

  • చిత్తూరు జిల్లాలో భారీ వర్షం... ఇద్దరు గల్లంతు..!

చిత్తూరు జిల్లాలో భారీ వర్షం... ఇద్దరు గల్లంతు..!

By: Anji Sun, 11 Oct 2020 08:59 AM

చిత్తూరు జిల్లాలో భారీ వర్షం... ఇద్దరు గల్లంతు..!

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాకాల దగ్గర వంక పొంగి పొర్లుతోంది. వాగు నీరు రోడ్డుపై ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రి 3.30 గంటల సమయంలో బైక్ పై రోడ్డు దాటుతూ ఇద్దరు యువకులు వర్షం నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు.

సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. బైక్ తో పాటు కొట్టుకుపోయిన తులసి రాం, తరుణ్ అనే ఇద్దరిని పోలీసులు క్షేమంగా కాపాడారు. చంద్రగిరి మండలం గాదంకి నుంచి బంగారుపాలెం సమీపంలోని అమరరాజా ఫ్యాక్టరీకి వెళుతుండగా ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు.

Tags :
|
|
|

Advertisement