విశాఖలో భారీ వర్షం ..పక్కన జిల్లాలకు అలెర్ట్
By: Sankar Mon, 12 Oct 2020 11:16 AM
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి విశాఖకు ఆగ్నేయంగా 310 కిలో మీటర్ల, కాకినాడకు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై.. విశాఖ-నరసాపురం మధ్య సోమవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రభావంతో తీరం వెంబడి 45-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.. రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేందం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఇటు మిగిలిన జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రతీరానికి సందర్శకులు రావద్దని సూచించారు. కాకినాడ, రాజమండ్రి అమలాపురం, రామచంద్రపురం ఆర్టీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.