Advertisement

భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

By: Sankar Tue, 29 Sept 2020 07:19 AM

భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ


భారీ వర్షాలకు ఎగువ నుంచి వర ద భారీగా వస్తుండటంతో కర్ణాటక, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు నీటితో తొణికిసలాడుతున్నాయి. జూరాలకు భారీగా వర ద వస్తుండటంతో 26 గేట్లను ఎత్తి దిగువకు 1,77,554 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2,35,800 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 1,99,341 క్యూసెక్కులుగా నమోదైం ది.

ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 60,160 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 43,088 క్యూసెక్కులు, నారాయణపురకు ఇన్‌ఫ్లో 69,188 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 60,777 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. జూరాల, సుంకేశుల నుంచి 2,64,339 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా.. జలాశయానికి 5,01,360 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో అధికారులు డ్యాం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,69,190 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. దీంతో కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రానికి 30,482 క్యూసెక్కులు విడుదల చేస్తుండ గా.. మొత్తం 4,99,672 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.

నాగార్జునసాగర్‌కు 5,76,478 క్యూసెక్కులు వస్తుండగా, 6,04,145 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి 1,69,885 క్యూసెక్కుల వరద వస్తుండగా 1.75 లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. మూడేండ్ల తర్వాత ప్రాజెక్టులోకి తిరిగి నీళ్లొచ్చాయి. ఈ నీటితో ఐదు మండలాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు, తొ మ్మిది నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటికి ఢోకా ఉండదు.

Tags :

Advertisement