రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
By: Sankar Sun, 13 Dec 2020 10:52 PM
రెండు తెలుగు రాష్ట్రాలలో గంజాయి కేసులు కలకలం రేపుతున్నాయి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుంచి గుట్టచుప్పుడు కాకుండా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమములో వారి నుండి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు టాస్క్ఫోర్స్ పోలీసులు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఎన్నికల గ్రామానికి చెందిన ముద్దు సతీశ్ అక్రమంగా గంజాయి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసుల సాయంతో సతీష్ ఇంటిపై దాడి చేసి 8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలోనూ గంజాయి కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు. నగరంలోని గామన్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు