Advertisement

  • కరోనాతో మృతి చెందిన తమ్ముడిని చూసి గుండెపోటుతో అన్న కూడా మరణం

కరోనాతో మృతి చెందిన తమ్ముడిని చూసి గుండెపోటుతో అన్న కూడా మరణం

By: chandrasekar Thu, 03 Sept 2020 09:42 AM

కరోనాతో మృతి చెందిన తమ్ముడిని చూసి గుండెపోటుతో అన్న కూడా మరణం


కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రాణాలను బలి తీసికుంది. ఈ క్రమంలో ఇద్దరు సోదరుల ప్రాణాలను తీసింది. తమ్ముడు కరోనాతో చనిపోవడాన్ని తట్టుకోలేని అన్న గుండెపోటుతో మరణించాడు. అందువల్ల ఇద్దరి కుటుంబాలు అనాధలుగా మిగిలింది. ఈ విషాధ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాలా మండటం పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో జరిగింది. తమ గ్రామానికి చెందిన సోదరులు ఇద్దరూ వారం వ్యవధిలో చనిపోవడంతో గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిత్రులతో సహా అందరూ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

చిట్టాపూర్ గ్రామంలో కరోనా వైరస్ పాజిటివ్ నివేదిక వచ్చిన అంజనేయులు (38) గత వారం చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్లో చేరాడు. ఇమ్మ్యూనిటి పవర్ తక్కువగా ఉండడంతో పరిస్థితి మరింత దిగజారి ఐదు రోజుల క్రితం మరణించాడు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేని వెంకటేష్ రెండు రోజులుగా బాధపడుతూ ఉన్నాడు. కాగా, బుధవారం నాడు తీవ్రమైన గుండెపోటుకు గురై కుప్పకూలి మరణించాడు. అంజనేయులుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, వెంకటేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో అన్నాదమ్ములు ఇద్దరూ మరణించడంతో చిట్టాపూర్ గ్రామంలో విషాధం అలుముకున్నది. వీరి మరణంతో ఇద్దరి కుటుంబాలు అనాధ పాలైంది.

Tags :

Advertisement