హత్రాస్ లో మరింత ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు ..లాఠీ ఛార్జి చేసిన పోలీసులు
By: Sankar Sun, 04 Oct 2020 10:30 PM
యూపీలోని హాథ్రస్లో అట్టుడుకుతనే ఉంది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన సమాజ్వాదీ పార్టీ నేతలను హాథ్రస్ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులకు వ్యతిరేకంగా సమాజ్ వాదీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులతో గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో...లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. దీంతో పలువురి గాయాలయ్యాయి. పోలీసుల ప్రతిఘటన మధ్యే ఎస్పీ నేతలు హాథ్రస్ చేరుకుని భాదిత కుటుంబాన్ని పరామర్శించారు.
బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ప్రభుత్వం నిందితులను రక్షించే ప్రయత్నం చేసిందని ఎస్పీ నేత అజంఖాన్ ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం కోరినట్టుగా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సిట్ అధికారులు బాధితురాలి కుటుంబం స్టేట్మెంట్ నమోదు చేశారు. అటు సిట్ సూచన మేరకు మెడికల్ టీం హాథ్రస్లో పర్యటించింది. బాధితురాలి కుటుంబంతో మాట్లాడి వైద్యులు వివరాలు సేకరించారు.