Advertisement

  • బెదిరింపులపై హైకోర్ట్ ను ఆశ్రయించిన భారత స్టార్ బౌలర్ భార్య

బెదిరింపులపై హైకోర్ట్ ను ఆశ్రయించిన భారత స్టార్ బౌలర్ భార్య

By: Sankar Tue, 15 Sept 2020 07:51 AM

బెదిరింపులపై హైకోర్ట్ ను ఆశ్రయించిన భారత స్టార్ బౌలర్ భార్య


భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ భార్య మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది..ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల రామ్‌ మందిర్ నిర్మాణానికి భూమి పూజ జరగగా.. హిందువులకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఓ వర్గానికి కోపం తెప్పించింది.

తనని కొందరు బెదిరిస్తున్నారంటూ ఇటీవల కోల్‌కతా పోలీసుల్ని ఆశ్రయించిన హసీన్ జహాన్.. ఫిర్యాదులో తనకి, తన కూతురుకి ప్రాణహాని ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా.. తనని సోషల్ మీడియాలో దూషిస్తున్నారని.. కొంత మంది తనని రేప్ చేస్తామని బెదిరింపులకి దిగుతున్నట్లు కూడా అందులో వివరించింది. కానీ.. పోలీసులు ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకుని ఎవరినీ అరెస్టు చేయలేదు.

పోలీసుల ఉదాసీనత కారణంగా తనపై ఇంకా బెదిరింపులు కొనసాగుతున్నాయని తాజాగా ఆరోపించిన హసీన్ జహాన్.. కోల్‌కతా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తనకి, తన కూతురికి ప్రాణహాని ఉందని ఆ పిటీషన్‌లో పేర్కొన్న హసీన్ జహాన్.. తమకి భద్రత కల్పించాలని కోరింది. పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత బెదిరింపులు మరింత పెరిగినట్లు ఆ పిటీషన్‌లో హసీన్ జహాన్ వివరించినట్లు తెలుస్తోంది.

కాగా రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్‌‌కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది..షమీ నుంచి నెలకి రూ. 10 లక్షలు భరణం కోరుతున్న హసీన్ జహాన్ ప్రస్తుతం న్యాయపోరాటం చేస్తోంది.

Tags :
|
|

Advertisement