Advertisement

  • కోవ్యాక్సిన్ తుది దశ ట్రయల్ డోసును వేయించుకున్న హర్యానా మంత్రి...

కోవ్యాక్సిన్ తుది దశ ట్రయల్ డోసును వేయించుకున్న హర్యానా మంత్రి...

By: chandrasekar Fri, 20 Nov 2020 5:32 PM

కోవ్యాక్సిన్ తుది దశ ట్రయల్ డోసును వేయించుకున్న హర్యానా మంత్రి...


దేశ్యావ్యాప్తంగా హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ ట్రయల్ డోసును హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ శుక్రవారం తీసుకున్నారు. అంబాలాలోని కరోనా ఆసుపత్రిలో ఆయ‌న ఈ రోజు కరోనా టీకాను వేయించుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రారంభమయ్యే కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా ఆయన టీకాను తీసుకున్నారు. ఈ కోవ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు తొలి వాలంటీర్‌గా తాను స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు మంత్రి అనిల్ విజ్ బుధవారం ట్విట్టర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్‌ ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో డ్రగ్ కంట్రోల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ కోవాక్సిన్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26వేల మంది వాలంటీర్లపై నిర్వహించనున్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఈ కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి రానుంది.

Tags :

Advertisement