Advertisement

కరోనా బారిన పడిన మరొక రాష్ట్ర సీఎం

By: Sankar Tue, 25 Aug 2020 08:25 AM

కరోనా బారిన పడిన మరొక రాష్ట్ర సీఎం


కరోనా వైరస్ మహమ్మారి ఎవరిని వదిలేలా లేదు..ఉన్నోడ,లేనోడా , సామాన్యుడా , రాజకీయనాయకుడు ఆ అనే బేధాలు లేకుండా అందరి మీద తన ప్రభావాన్ని చూయిస్తుంది..ఇప్పటికే అనేక మంది కేంద్ర మంత్రులు , రాష్ట్రాల నాయకులూ కరోనా భారిన పాడగా తాజాగా మరొక రాష్ట్ర సీఎంకు కరోనా పాజిటివ్ వచ్చింది..

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. ‘ఈ రోజు నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. నాతో సన్నిహితంగా మెలిగిన వారు వెంటనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఖట్టర్ ట్వీట్ చేశారు.

ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. దేశంలో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులను కరోనా వణికిస్తోంది. హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ మహమ్మారి బారినపడి యూపీలో ఇద్దరు మంత్రులు మృతి చెందారు.

Tags :
|
|
|

Advertisement