నాలుగు నెలలుగా నా బిడ్డను చూడలేదు ...ఇక కుటుంబంతో గడుపుతా ..హార్దిక్ పాండ్య
By: Sankar Tue, 08 Dec 2020 8:47 PM
ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు టి ట్వంటీ ల సిరీస్ లో టీం ఇండియా వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే...ఈ సిరీస్ లో భారత స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాట్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడి సిరీస్ విజయం లో కీలక పాత్ర పోషించాడు..దీనితో హార్దిక్ పాండ్యకు మాన్ అఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది...
అయితే నాకు ఆ అవార్డు దక్కుతుందని అసలు ఊహించలేదు. జట్టుగా సమష్టిగా రాణించడంతోనే ఆసీస్పై సిరీస్ సాధించాం. రెండో వన్డేలో ఓటమి తర్వాత ఒకటే అనుకున్నాం. ఇది నాలుగు మ్యాచ్ సిరీస్గానే భావించాం(చివరి వన్డే, మూడు టీ20లు). ఫలితంగా వరుసగా మూడు విజయాలు సాధించాం. ఇది మా జట్టులో సంతోషాన్ని తీసుకొచ్చింది. సిరీస్ ఆరంభమైన తర్వాత నాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనిపించలేదు...
గెలిస్తేనే ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అర్హులం అని అనుకున్నా. నేను నాలుగు నెలలుగా నా బిడ్డను చూడలేదు. ఇక కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా’ అని హార్దిక్ తెలిపాడు. కేవలం ఆసీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కు మాత్రమే ఎంపికైన హార్దిక్.. స్వదేశానికి బయల్దేరనున్నాడు.