మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కు నటరాజన్ అర్హుడు ...హార్దిక్ పాండ్య
By: Sankar Mon, 07 Dec 2020 4:32 PM
నిన్న ఆస్ట్రేలియా తో జరిగిన టి ట్వంటీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించినప్పటికీ టీం ఇండియా ఆ లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సాధించడమే కాకుండ, సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది.భారత్ ఇన్నింగ్స్ లో పాండ్య మెరుపు వేగంతో పరుగులు సాధించి టీం ఇండియా విజయానికి ముఖ్య భూమిక పోషించాడు దీనితో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అతడినే వరించింది..
దీనిపై అవార్డు తీసుకున్న తర్వాత హార్దిక్ మాట్లాడుతూ.. ‘నాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించడం ఆశ్చర్యపరిచింది..మేము గెలవడానికి ఆసీస్ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేయడమే. ఆసీస్ ఇంకా 10 నుంచి 15 పరుగులు చేయాల్సి ఉన్నా కట్టడి చేయగలిగాం. దానికి నటరాజన్ బౌలింగ్ స్పెల్స్ ఒక కారణం. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కు నటరాజన్ అర్హుడు. మేము గెలవడానికి పరుగుల్లో వ్యత్యాసం తీసుకురావడమే’ అని పాండ్యా తెలిపాడు.
ఇక తన భారీ హిట్టింగ్ గురించి మాట్లాడిన హార్దిక్ మాట్లాడుతూ.. వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరోన్ పొలార్డే తనకు ఆదర్శమన్నాడు. ‘ పొలార్డ్ షాట్లను అతి దగ్గర నుంచి చూసినవాళ్లలో నేను ఒకడ్ని. ఇది నిజంగా నా అదృష్టం. మేము చాలా కాలంగా ఐపీఎల్లో ఆడుతున్నాం. ఫ్రాంచైజీ క్రికెట్లో మునిగితేలుతున్నాం. దాన్ని ప్రొఫెషనల్ క్రికెట్లో కూడా కొనసాగిస్తున్నాం.
మనకు అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిలో పడినప్పుడు ఐపీఎల్ ఆడిన అనుభవం బాగా ఉపయోగపడుతుంది. ఈ సీజన్ ఐపీఎల్లో నేను బాగా బ్యాటింగ్ చేశా. లాక్డౌన్ సమయంలో ఎలా మ్యాచ్లు ఫినిష్ చేయాలనే దానిపై వర్కౌట్ చేశా’ అని పేర్కొన్నాడు.