Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి స్పష్టమైన సమాచారం ఇవ్వని హర్భజన్

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి స్పష్టమైన సమాచారం ఇవ్వని హర్భజన్

By: chandrasekar Wed, 02 Sept 2020 6:47 PM

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి స్పష్టమైన సమాచారం ఇవ్వని హర్భజన్


చెన్నై సూపర్ కింగ్స్‌కి నుంచి ఇప్పటికే సీనియర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలగగా ఇప్పుడు అదే బాటలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా సెప్టెంబరు 1న అక్కడికి వెళ్లాల్సిన హర్భజన్ సింగ్ భారత్‌లోనే ఉన్నాడు. దాంతో టోర్నీలో అతను ఆడటం అనుమానమేనని వార్తలు వినబడుతున్నాయి.

గత శుక్రవారం చెన్నై జట్టులో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్‌కి హర్భజన్ సింగ్ దూరంగా ఉండబోతున్నాడనే వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అధికారి స్పందించాడు. ‘‘అవును నిజమే హర్భజన్ సింగ్ సెప్టెంబరు 1న యూఏఈకి చేరుకోవాల్సి ఉంది. కానీ అతను తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. హర్భజన్ తన ప్రయాణంపై ఇప్పటి వరకూ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. అయితే ఐపీఎల్ 2020 నుంచి హర్భజన్ ఇప్పటికే వైదొలిగినట్లు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదు’’ అని ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తెలియచేసారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌‌తో పాటు టీమ్ స్టాఫ్ మెంబర్స్ 10 మందికి గత శుక్రవారం కరోనా నిర్ధారణ కాగా సోమవారం నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ ఈ 13 మందికీ గురువారం మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. రెండో సారి కూడా నెగటివ్ వస్తే శనివారం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రాక్టీస్ ప్రారంభించనుంది.

Tags :
|

Advertisement