ఎన్డీయేకి గూర్ఖా జన్ ముక్తి మోర్చా గుడ్ బై...!
By: Anji Wed, 21 Oct 2020 8:30 PM
ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న గూర్ఖా జనముక్తి మోర్చా తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. తాము అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సంస్థ అధ్యక్షుడు బిమల్ గురుంగ్ కోల్ కతా లో తెలిపారు.
వచ్ఛే ఏడాది జరిగే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని ఆయన చెప్పారు. గూర్ఖాలాండ్ ను సాధించాలన్న తమ డిమాండును బీజేపీ తీర్చలేదని ఆయన ఆరోపించారు.
ఈ డిమాండును ఎవరు సమర్థించినా ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. 12 ఏళ్ళు గడిచినా తమ కోర్కె నెరవేరలేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ ధ్యేయమన్నారు.
Tags :
kolkata |
nda |