Advertisement

  • భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం లేదు ..గుజరాత్ సీఎం విజయ్ రూపాని

భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం లేదు ..గుజరాత్ సీఎం విజయ్ రూపాని

By: Sankar Mon, 07 Dec 2020 5:41 PM

భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం లేదు ..గుజరాత్ సీఎం విజయ్ రూపాని


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలు మంగళవారం పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు మద్దతివ్వడం లేదని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ తెలిపారు.

తమ రాష్ట్రంలో బంద్‌ జరుగకుండా అడ్డుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో దుకాణాలను, ఇతర సంస్థలను ఎవరైనా బలవంతంగా మూసివేయడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాగా ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు ఆ పార్టీకి అనుకూలమైన తమిళనాడు ప్రభుత్వం కూడా భారత్‌ బంద్‌ను మద్దతివ్వడం లేదు. అనుమతి లేకుండా ఎవరైనా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర మంత్రి డీ జయకుమార్‌ హెచ్చరించారు.



Tags :

Advertisement