అది వారి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం ..ధోని పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
By: Sankar Fri, 30 Oct 2020 08:56 AM
ఈ సారి ఐపీయల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణ ప్రదర్శనతో లీగ్ దశలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే...దీనితో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు..మరోవైపు ధోనికి ఇదే చివరి సీజన్ అని భావిస్తున్న అభిమానులకు జట్టు యాజమాన్యం వచ్చే ఏడాది కూడా ధోనీనే కెప్టెన్ అని చెప్పి గుడ్ న్యూస్ చెప్పింది ...
అయితే పేలవ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ఐపీఎల్ ప్లేఆఫ్స్కు దూరమైనా... వచ్చే ఏడాది కూడా ఎంఎస్ ధోనినే జట్టు కెప్టెన్గా కొనసాగవచ్చని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అభిప్రాయ పడ్డాడు. ధోనికి, టీమ్ మేనేజ్మెంట్కు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం అలాంటిదని అతను వ్యాఖ్యానించాడు. రెండు వైపులనుంచి పరస్పర గౌరవం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గంభీర్ అన్నాడు.
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి చెన్నై మేనేజ్మెంట్ ధోనికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దానికి తగినట్లుగానే అతను అద్భుత ఫలితాలు సాధించి చూపించాడు. జట్టు కోసం ఎంతో చేశాడు. కాబట్టి మరోసారి ధోనిని చెన్నై కెప్టెన్గా కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు. అతనికి మేనేజ్మెంట్పై, వారికి ధోనిపై ఉన్న పరస్పర గౌరవం, అనుబంధమే అందుకు కారణం.
ఆటలో భావోద్వేగాలకు చోటు లేదు అనే మాటలు చెప్పడం సులువే కానీ ఆ దగ్గరితనాన్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి 2021లో ప్రస్తుత జట్టులో చాలా మార్పులు జరిగినా కెప్టెన్గా మాత్రం ధోనినే ఉంటాడని నేను నమ్ముతున్నా’ అని గంభీర్ విశ్లేషించాడు.