బావమరిదిని చంపిన పెళ్లికొడుకు
By: chandrasekar Sat, 20 June 2020 09:43 AM
వరుడు, అతడి
స్నేహితులు పెళ్లికూతురు తరపు బంధువులతో మిఠాయిలు వడ్డించే గొడవకు దిగారు. చిన్న
గొడవ కాస్త పెద్దగా మారింది.
అప్పుడే పెళ్లిచేసుకున్న
ఓ జంట తమ భవిష్యత్ కళల ప్రపంచాన్ని ఊహించుకుంటున్నాయి. పెళ్లికి వచ్చిన బంధువులంతా
ఒకరినొకరు అప్యాయ పలకరింపులతో సందడి నెలకొంది. మరోవైపు పెళ్లికి వచ్చిన వారికి
మంచి రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు.
ఇంతలో ఓ చిన్నపాటి వివాదం
జరిగింది. వరుడు, అతడి స్నేహితులు మిఠాయిలు వడ్డించే విషయమై
పెళ్లికూతురు తరుపు బంధువులతో ఘర్షణకు దిగారు. మద్యం మత్తులో ఉన్న వరుడు.. వధువు
తరపు బంధువుల పైకి కాల్పులు జరిపాడు.
అంతటితో ఆగకుండా వధువు
సొంత తమ్ముడిని బలవంతంగా కారులో తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. ఈ దారుణ ఘటన
ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫరుఖాబాద్కి చెందిన
మనోజ్ కుమార్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సోమవారం రాత్రి
పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన వివాహ విందు విషయంలో మిఠాయిలు వడ్డించే విషయమై
వరుడు, అతడి
స్నేహితులు పెళ్లికూతురు తరపు బంధువులతో గొడవకు దిగారు. చిన్న గొడవ కాస్త పెద్దగా
మారింది. దీంతో బంధువులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
మద్యం మత్తులో ఉన్న వరుడు, అతడి
మిత్రులు పెళ్లికూతురు మామయ్యపై కాల్పులు సైతం జరిపాడు. కానీ అతడు తృటిలో
తప్పించుకున్నాడు. అయితే అక్కడే భోజనం చేస్తున్న వారికి నీళ్లు అందిస్తున్న
పెళ్లికూతురు సోదరుడు ప్రన్షు(9)ను వరుడు, అతడి స్నేహితులు తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారని
చెప్పారు. వరుడు కారులో వేగంగా వెళుతూ ఇద్దరు మహిళలు, బాలికను
ఢీకొట్టినట్టి కారులో పారిపోయారు.
పెళ్లికొడుకు మనోజ్కు
ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు వెనక్కి రాలేదు. తెల్లవారుజామున 3 గంటల
సమయంలో ప్రన్షు మృతదేహాన్ని గ్రామంలో పడేసిపోయారు. ఈ మేరకు పెళ్లికూతురు తండ్రి
పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు
పెళ్లికొడుకు, అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు. బాలుడి మృతదేహం
పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.