Advertisement

  • ఆర్మీ కాన్వాయిపై గ్ర‌నేడ్ దాడి..గురి తప్పి సాధారణ పౌరులకు తీవ్ర గాయాలు

ఆర్మీ కాన్వాయిపై గ్ర‌నేడ్ దాడి..గురి తప్పి సాధారణ పౌరులకు తీవ్ర గాయాలు

By: Sankar Mon, 31 Aug 2020 4:31 PM

ఆర్మీ కాన్వాయిపై గ్ర‌నేడ్ దాడి..గురి తప్పి సాధారణ పౌరులకు తీవ్ర గాయాలు


జ‌మ్ముక‌శ్మీర్‌లో బారాముల్లాలో భ‌ద్ర‌తా ద‌ళాల కాన్వాయ్ ల‌క్ష్యంగా గ్రనేడ్ దాడి జ‌రిగింది. అయితే అది గురిత‌ప్ప‌డంతో ఐదుగురు సాధార‌ణ పౌరులు గాయ‌పడ్డారు. అందులో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు.

బారాముల్లా జిల్లాలోని ఆజాద్ గంజ్ ప్రాంతంలో పెట్రోలింగ్ కాన్వాయ్ ల‌క్ష్యంగా దుండ‌గులు గ్ర‌నేడ్ విసిరార‌ని జ‌మ్మ‌క‌శ్మీర్ పోలీసులు తెలిపారు. అయితే గ్ర‌నేడ్ కాన్వాయ్ వెల్లిపోయిన తర్వాత పేల‌డంతో రోడ్డు ప‌క్క‌న ఉన్న ఐదుగురు పౌరుగు గాయ‌ప‌డ్డార‌ని చెప్పారు. అందులో ఇద్ద‌రి ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ద‌ని, వారిని మెరుగైన చికిత్స కోసం శ్రీన‌గ‌ర్‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు.

కాగా, వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌త ద‌ళాలు ఆజాద్ గంజ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడికి పాల్ప‌డిన‌వారికోసం ప్రాంతంలో గాలింపు చేప‌ట్టాయి. అక్క‌డ రాక‌పోక‌ల‌ను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.


Tags :
|

Advertisement