Advertisement

  • సిటీ బస్సు, మెట్రో రైళ్ల పరుగులకు గ్రీన్ సిగ్నల్

సిటీ బస్సు, మెట్రో రైళ్ల పరుగులకు గ్రీన్ సిగ్నల్

By: Anji Sun, 30 Aug 2020 1:09 PM

సిటీ బస్సు, మెట్రో రైళ్ల పరుగులకు గ్రీన్ సిగ్నల్

కరోనా కారణంగా ప్రజా రవాణ దాదాపు మూడు నెలల పాటు కరోనా దెబ్బకు ప్రజా రవాణ వ్యవస్థ కుప్పకూలింది. అయితే కేంద్రం ఇప్పుడు లాక్ డైన్ అనలాక్ ప్రక్రియ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా మెట్రో రైళ్ల పరుగులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో హైదరాబాద్‌లో కూడా సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భాగ్యనగరంలో సిటీ బస్సులు కూడా తిప్పేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

నగరంలో సిటీ బస్సులు తిప్పేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందించినట్లు సమాచారం. నగరంలో సిటీబస్సులు తిరగక పోవడంతో చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కరోనా కష్టకాలంలో చాలిచాలనీ జీతాలతో నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రతీ చిన్న ఉద్యోగి కూడా సిటీ బస్సు ఎప్పుడు నడుస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ప్రజా సంఘాలు కూడా హైదరాబాద్‌లో సిటీ సర్వీసుల్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే అధికారులు కూడా ఎప్పటికప్పుడు సిటీ బస్సులను నడపాలని ప్రయత్నిస్తున్నా.. గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆ ఆలోచనకు బ్రేకులు వేస్తున్నాయి. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో సిటీ బస్సులు నడపాలా వద్ద అన్న అయోమయోంలో పడిపోతున్నారు. అయితే కష్టాల కడలిలో ఉన్న ఆర్టీసీ గట్టెక్కాలంటే అటు అంతరాష్ట్ర సర్వీసులతో పాటు ఇటు హైదరాబాద్ సిటీ బస్సుల్ని కూడా నడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

సిటీలో దాదాపు 33 లక్షల మంది ప్రజలు సరాసరిగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వారంతా బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి. దీంతో సెప్టెంబర్ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కూడా అధికారులతో పలు సార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement