కరోనా కు బలి అయిన మహాత్మ గాంధీ ముని మనవడు సతీష్ దూపేలియా
By: Sankar Mon, 23 Nov 2020 08:37 AM
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బలి అయ్యారు ..తాజాగా మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్ ధుపేలియా (66) కోవిడ్ కారణంగా తుదిశ్వాస విడిచారు.
దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో నివసించే సతీశ్ కొంతకాలంగా న్యూమోనియాతో సతమతమవుతున్నారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనకు ఇటీవల కరోనా సోకింది.
మూడు రోజుల క్రితమే పుట్టినరోజు జరపుకొన్న సతీశ్ ఆదివారం రాత్రి హఠాత్తుగా గుండె పోటు రావడం వల్ల చనిపోయినట్లు.. ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్త్రీ వెల్లడించారు. సతీశ్ దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు సామాజిక కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. సతీశ్ ధుపేలియా తన జీవితంలో ఎక్కువ భాగం మీడియా రంగంలోనే గడిపారు. వీడియో, ఫోటో గ్రాఫర్గా పని చేశారు.