Advertisement

  • కరీంనగర్ జిల్లాలో అద్భుతం ..కరోనా ను జయించిన 90 ఏళ్ళ బామ్మలు

కరీంనగర్ జిల్లాలో అద్భుతం ..కరోనా ను జయించిన 90 ఏళ్ళ బామ్మలు

By: Sankar Fri, 14 Aug 2020 5:43 PM

కరీంనగర్ జిల్లాలో అద్భుతం ..కరోనా ను జయించిన 90 ఏళ్ళ బామ్మలు


కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి ..కరోనా వచ్చింది అనేదానికంటే ఆ భయానికి ఎక్కువ మంది చనిపోతున్నారు..ఇండియాలో అయితే ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది .కరోనా రాగానే వెంటనే టెన్షన్ పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..

కొంత మంది తాము ఇక బతుకలేమోనని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందుకు యువత కూడా మినహాయింపు కాదు. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో అద్భుతమే చోటు చేసుకుంది.

90 ఏండ్ల వయసులో కరోనాను జయించిన ఇద్దరు బామ్మలు ఔరా అనిపిస్తున్నారు. జిల్లాలోని గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన జనగం ఆగమ్మ(93), గుర్రం లచ్చమ్మ(94) గత నెల 26న కరోనా బారిన పడ్డారు. వీరు దవాఖానలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. కరోనా పిల్లలు, వృద్ధులకు సోకితే బతకడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. అయితే మనోధైర్యమే మందుగా గుండె నిబ్బరంతో ఉంటూ కరోనాను జయించ వచ్చని ఈ బామ్మలు రుజువు చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement