Advertisement

తాత చేతిలో దారుణ హత్యకు గురి అయిన మనవడు..

By: Sankar Mon, 07 Sept 2020 12:01 PM

తాత చేతిలో దారుణ హత్యకు గురి అయిన మనవడు..


ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే మనవడు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటి దదగ్గరే ఉంటూ వ్యసనాలకు బానిస అయి కుటుంబ సభ్యులను బాధపెడుతున్నందుకు అతడి తాత చేతిలోనే దారుణ హత్యకు గురి అయినా ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది..వివరాల్లోకి వెళ్తే పూనూరు చిన్న వెంకటరెడ్డి, వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెద్ద కుమారుడు రాఘవేంద్రరెడ్డి(20) గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రెవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆరు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. అయితే తరుచూ మద్యం సేవిస్తూ, పేకాటాడుతూ నిత్యం డబ్బుల కోసం కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు.ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులపై ఒత్తిడి ఎక్కువ చేశాడు. నా ఆస్తి వాటా పంచి ఇస్తే కారు కొనుక్కోని బాడుగకు తిప్పుకుంటానని, ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు దిగాడు.

ఈ నేపథ్యంలో ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో రాఘవేంద్రరెడ్డి జేజీనాయన పూనూరు పెద్ద ఓసూరారెడ్డి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. హత్య చేసిన అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ యు సుధాకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Tags :

Advertisement